
స్పటికమాల…శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్ఫటిక మాల ధారణ వల్ల కూడ జాతకులు
శాంతిని అనుభవిస్తారని చెప్పబడింది.వివాహకారకుడు శుక్రుడు .వివాహం కాని
వారు,వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం అయిన తరువాత దాంపత్య సౌఖ్యంలో
ఇబ్బందులు ఎదుర్కోనేవారు శుక్రగ్రహనికి చెందిన స్పటిక మాలను ధరించటం
మంచిది. ‘స్ఫటికమంత స్వచ్ఛన’ (క్రిస్టల్ క్లియర్) అనేపద ప్రయోగం మనం విని
వున్నదే. నిర్మలమయిన మనస్సును స్ఫటికంతో పోలుస్తారు.
”మాలాకప్తాసనస్థ: స్ఫటిక మణి నిభై ర్మౌక్తికై ర్మండి తాఙ్గ:” అంటూ
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రావళిలో స్పటికమణి గురించిన ప్రస్తావన వుంది.
చాలామంది రుద్రాక్షలతో పాటు స్ఫటిక మాలను కూడ కంఠసీమలో ధరిస్తారు.
జప పారాయ ణకు స్ఫటికమాలను వివిధ మతస్థులు ఉపయోగిస్తారు. స్పటిక మాలను సమస్త దేవతామూర్తులకు జపమాలగా ఉపయోగించవచ్చును. ముఖ్యంగా లలిత సహస్త్రనామం,లక్ష్మీ అష్టోత్తరం చేసే వారు స్పటికమాలను జపమాలగా ఉపయోగిస్తే సత్వర ఫలితాలు వస్తాయి.
స్ఫటికం ఓ మణిగా చెప్పబడింది. పారదర్శకంగా వుండటం ఈ రాయి ప్రత్యేకత. ద్రవరూపంలోని వస్తువు భూమి పొరల లోపల వివిధ పదార్థాలతో కలిసి, గట్టిపడి స్పటికంగా రూపాంతరం చెందుతుంది. జాతి స్ఫటికాలు ధారకునికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయి. అధిక రక్తపోటు వున్నవారు గనక స్ఫటిక మాల ధరిస్తే వారి రక్త పీడనం శాంతించి స్వస్థత చేకూరుతుంది. స్ఫటికధారణ వల్ల దగ్గు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల ఉపశమనం కలుగుతుంది.స్ఫటికం వల్ల ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ శాంతి స్తుంది. బిడ్డలు లేనివారికి సంతా న ప్రాప్తి కలుగు తుంది. స్పటికం ధరించడం వల్ల మగ వారిలో నపుంసకత్వం తొలగి పోతుందని తెలుస్తుంది.
చాల జబ్బులకు స్ఫటికాలను ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరంపై ధరించడం వల్లను, ఇంట్లో పూజగదిలో వాటిని వుండచడం వల్లను ఉత్పన్న మయ్యే తరంగ ప్రకంపనల వల్ల, మానవ శరీరంలో వుండే కంటికి కనిపించని మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ప్రభావితమై ఆయా చక్రాల పరిధిలోని అవయవాలకు పరిపుష్టి చేకూరి ఆరోగ్యం స్వంతమౌతుంది.
స్ఫటిక మాలను కంఠ సీమలో ధరించడం వల్ల మనో వ్యాధులు, ఇద మిదంగా తెలయని రోగాలు బాధిస్తూ భయపూరిత వాతావరణం వుంటే ఆ భావన నిర్వీర్యమై ధారకునికి శారీరక, మానసిక స్వస్థత కలుగుతుంది. ధ్యాన ప్రక్రియలో స్ఫటిక మాల ధరించడం వల్ల తురీయ స్థితి తొందరగా చేరువయ్యే అవకాశం వుంది.
స్ఫటికాలను ఒక గ్లాసు పరిశుభ్రమయిన త్రాగునీటిలో వుంచి కొన్ని గంటల తర్వాత త్రాగటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------

ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు,జిల్లేడు పూలు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను. చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మోదుగ చెక్క,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.
కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శుక్ర గ్రహదోషము: యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శని గ్రహ దోషము: నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
రాహు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
కేతు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.
శనిగ్రహా దోష నివారణకు గుర్రపు నాడా(Horse Shoe)
గుర్రపు నాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని
మాత్రమే స్వీకరించాలి.గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయోగించినను
ఎటువంటి ఫలితము ఉండదు.గుర్రపునాడాని శనివారం గాని, శనిత్రయోదశి నాడు గాని
సేకరించి గుర్రపునాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి.
సింధూరంతో పూసిన గుర్రపునాడాని శని వారం ఉదయం ఇల్లు లేదా ఆఫీసు లేదా ప్యాక్టరీ యొక్క ప్రదాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి.ఇంటికి సంబందించినంతవరకు గుర్రపునాడాని “A” ఆకారంలో ఉంచాలి.అనగా ఊర్ధ్వ ముఖంగా ఉంచాలి.ఇలా ఉంచటంవలన శనిదోషం ,నరదృష్టి ప్రభావాలు కిందకి అనగద్రొక్కబడతాయి.
గుర్రపునాదాని వ్యాపార స్ధలంలో గాని ప్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున “U” ఆకారంలో ఉంచాలి.ఇలా ఉంచడంవలన శత్రుభాధలు,దృష్టి దోషాలు దరిచేరనివ్వదు.
ఉపయోగాలు:-
1)ఏలినాటి శని,అష్టమ శని,అర్ధాష్టమ శని ఉన్నవారు వారు నివసిస్తున్న ఇంటిలోగాని వ్యాపారస్ధలంలో గాని గుర్రపునాడాని ఉంచిన లేదా నాడా చేసిన రింగుని ఎడమచేతి మధ్య వ్రేలుకి ధరించిన,నాడాని కడియంలాగా చేసుకొని ఎడమచేతికి ధరించిన శనితీవ్రత తగ్గు ముఖం పడుతుంది.
2)అంగారక దోషం కూడ తగ్గుతుందని కొంతమంది నమ్మకం.
3)గుర్రపునాడా ఉన్న ఇల్లు ఇంటిలోనివారికి రక్షణ కవచంలాగా ఉంటుంది.
4)చేతబడులు,రోగాలు,దృష్టిదోషాలు ధరిచేరనివ్వదు.
5)మంచి ఆరోగ్యాన్ని చురుకు తనాన్ని ప్రసాదిస్తుంది.
6)ఇనుము,నూనె,పెట్రోల్ బంక్ లు ,నువ్వులు,మిరియాల వ్యాపారాలు చేసేవారు తప్పకుండా వారి వ్యాపారస్ధలంలో గుర్రపునాడాని ప్రధాన ద్వారానికి ఉంచాలి.
7)రాజకీయ నాయకులు, సినిమా,సాప్ట్వేర్ ,టెలికమ్యూనికేషన్,అధికారుల తోటి అవమానాలు ఉన్నవారు ఈ గుర్రపునాడాని ఉపయోగించాలి.
శని సంచారం అంటే సాధారణంగా అందరూ అధికంగా భయపడతారు. నిజంగా ఆయన అంత భయంకరమైన గ్రహమా? రాశి చక్రంలో మకర కుంభ రాశులకు అధిపతి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.
‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు.ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.
జైమిని సూత్రాలతో బాగా రీసెర్చ్ చేసేవారు ఒక మంచి మాట చెబుతారు. ఎవరి వ్యాపకములలో వారు వుంటే శని ఏమీ చేయడు అని. అది నిజమే. ఇతరుల పనులలో తలదూర్చినా చేయు వృత్తితో పాటు కొత్త వృత్తి ఆశ్రయించినా అది ఇబ్బంది పెట్టే అంశాలుగా మారుస్తాడు. ప్రాకృత ధర్మం తప్పిన వారి విషయంలోనే శని ప్రభావం అధికం అని చెబుతారు.
ఐరన్, స్టీల్, సిమెంట్, సాల్ట్బేస్డ్ వ్యాపారాలు, ఫర్నీచర్, మందులు వంటి వ్యాపారులు, వైద్యులు బాగున్నారు అంటే వారికి శని అనుగ్రహం వున్నది అని గ్రహించవచ్చు. అలాగే శని దోషం త్వరగా ప్రసరించేది మాలిన్యమైన సందర్భాలలోనే. అందులో భాగంగా పురాణాలలో విజ్ఞానం ఉండి అలాగే జ్యోతిశ్శాస్త్రం మీద అవగాహన ఉన్నవారు చెప్పే శని శాంతి మార్గాలు.
ప్రాకృతమయిన ధర్మాలు విడనాడటం, ఒకరి చెప్పులు మరొకరు ధరించడం, ఒకరోజు ధరించిన వస్తమ్రులు మరుసటిరోజు ధరించడం, పగలు నిద్రా సామాగ్రి వాడటం, మంచం మీద పగలు కూర్చోవడం, పడుకోవడం, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండటం, రాత్రులందు తైలము రాసుకోవడం, ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడడం, పురుషుడు రోజూ తలస్నానం చేయకపోవడం, తోలు, ఉప్పు ఇనుము చెక్క వంటి వస్తువులు ఉచితంగా తీసుకోవడం, పాదప్రక్షాళన లేకుండా బయట తిరిగి ఇంటిలోకి రావడం, ఇలా జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే అంశాలు అన్నీ కూడా ఎవరయితే పాటిస్తారో వారిని శనైశ్చరుడు ఇబ్బందికి గురి చేస్తాడు అని చెబుతారు.
జప పారాయ ణకు స్ఫటికమాలను వివిధ మతస్థులు ఉపయోగిస్తారు. స్పటిక మాలను సమస్త దేవతామూర్తులకు జపమాలగా ఉపయోగించవచ్చును. ముఖ్యంగా లలిత సహస్త్రనామం,లక్ష్మీ అష్టోత్తరం చేసే వారు స్పటికమాలను జపమాలగా ఉపయోగిస్తే సత్వర ఫలితాలు వస్తాయి.
స్ఫటికం ఓ మణిగా చెప్పబడింది. పారదర్శకంగా వుండటం ఈ రాయి ప్రత్యేకత. ద్రవరూపంలోని వస్తువు భూమి పొరల లోపల వివిధ పదార్థాలతో కలిసి, గట్టిపడి స్పటికంగా రూపాంతరం చెందుతుంది. జాతి స్ఫటికాలు ధారకునికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాయి. అధిక రక్తపోటు వున్నవారు గనక స్ఫటిక మాల ధరిస్తే వారి రక్త పీడనం శాంతించి స్వస్థత చేకూరుతుంది. స్ఫటికధారణ వల్ల దగ్గు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల ఉపశమనం కలుగుతుంది.స్ఫటికం వల్ల ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ శాంతి స్తుంది. బిడ్డలు లేనివారికి సంతా న ప్రాప్తి కలుగు తుంది. స్పటికం ధరించడం వల్ల మగ వారిలో నపుంసకత్వం తొలగి పోతుందని తెలుస్తుంది.
చాల జబ్బులకు స్ఫటికాలను ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరంపై ధరించడం వల్లను, ఇంట్లో పూజగదిలో వాటిని వుండచడం వల్లను ఉత్పన్న మయ్యే తరంగ ప్రకంపనల వల్ల, మానవ శరీరంలో వుండే కంటికి కనిపించని మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ప్రభావితమై ఆయా చక్రాల పరిధిలోని అవయవాలకు పరిపుష్టి చేకూరి ఆరోగ్యం స్వంతమౌతుంది.
స్ఫటిక మాలను కంఠ సీమలో ధరించడం వల్ల మనో వ్యాధులు, ఇద మిదంగా తెలయని రోగాలు బాధిస్తూ భయపూరిత వాతావరణం వుంటే ఆ భావన నిర్వీర్యమై ధారకునికి శారీరక, మానసిక స్వస్థత కలుగుతుంది. ధ్యాన ప్రక్రియలో స్ఫటిక మాల ధరించడం వల్ల తురీయ స్థితి తొందరగా చేరువయ్యే అవకాశం వుంది.
స్ఫటికాలను ఒక గ్లాసు పరిశుభ్రమయిన త్రాగునీటిలో వుంచి కొన్ని గంటల తర్వాత త్రాగటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------

ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు,జిల్లేడు పూలు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను. చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మోదుగ చెక్క,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.
కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శుక్ర గ్రహదోషము: యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శని గ్రహ దోషము: నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
రాహు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
కేతు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.

సింధూరంతో పూసిన గుర్రపునాడాని శని వారం ఉదయం ఇల్లు లేదా ఆఫీసు లేదా ప్యాక్టరీ యొక్క ప్రదాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి.ఇంటికి సంబందించినంతవరకు గుర్రపునాడాని “A” ఆకారంలో ఉంచాలి.అనగా ఊర్ధ్వ ముఖంగా ఉంచాలి.ఇలా ఉంచటంవలన శనిదోషం ,నరదృష్టి ప్రభావాలు కిందకి అనగద్రొక్కబడతాయి.
గుర్రపునాదాని వ్యాపార స్ధలంలో గాని ప్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున “U” ఆకారంలో ఉంచాలి.ఇలా ఉంచడంవలన శత్రుభాధలు,దృష్టి దోషాలు దరిచేరనివ్వదు.
ఉపయోగాలు:-
1)ఏలినాటి శని,అష్టమ శని,అర్ధాష్టమ శని ఉన్నవారు వారు నివసిస్తున్న ఇంటిలోగాని వ్యాపారస్ధలంలో గాని గుర్రపునాడాని ఉంచిన లేదా నాడా చేసిన రింగుని ఎడమచేతి మధ్య వ్రేలుకి ధరించిన,నాడాని కడియంలాగా చేసుకొని ఎడమచేతికి ధరించిన శనితీవ్రత తగ్గు ముఖం పడుతుంది.
2)అంగారక దోషం కూడ తగ్గుతుందని కొంతమంది నమ్మకం.
3)గుర్రపునాడా ఉన్న ఇల్లు ఇంటిలోనివారికి రక్షణ కవచంలాగా ఉంటుంది.
4)చేతబడులు,రోగాలు,దృష్టిదోషాలు ధరిచేరనివ్వదు.
5)మంచి ఆరోగ్యాన్ని చురుకు తనాన్ని ప్రసాదిస్తుంది.
6)ఇనుము,నూనె,పెట్రోల్ బంక్ లు ,నువ్వులు,మిరియాల వ్యాపారాలు చేసేవారు తప్పకుండా వారి వ్యాపారస్ధలంలో గుర్రపునాడాని ప్రధాన ద్వారానికి ఉంచాలి.
7)రాజకీయ నాయకులు, సినిమా,సాప్ట్వేర్ ,టెలికమ్యూనికేషన్,అధికారుల తోటి అవమానాలు ఉన్నవారు ఈ గుర్రపునాడాని ఉపయోగించాలి.
శని సంచారం అంటే సాధారణంగా అందరూ అధికంగా భయపడతారు. నిజంగా ఆయన అంత భయంకరమైన గ్రహమా? రాశి చక్రంలో మకర కుంభ రాశులకు అధిపతి. అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్రలకు ఆధిపత్యం వహిస్తూ 19 సంవత్సరాల కాలం దశాకాలం తీసుకున్న శని, అందరినీ ఇబ్బంది పెడతారా? శని వచ్చాక మాత్రమే బాగు పడినవారూ ఉన్నారు.
‘యుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చరమ్’ అని ‘ముహూర్త దర్పణం కారక నిఘంటువు’లో ఉంటుంది. ఆయుష్షు జీవనోపాధి రెండింటికీ శనియే కారకుడు.ఇటువంటి కారకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు. ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరములు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఇచ్చే స్థాయి అధికమైనదే అంటే ఆశ్చర్యమే. మారకత్వం ఇవ్వాలి అంటే ఇతర ఏ గ్రహాలు సరియగు స్థితిలో లేవు అంటే అప్పుడు ‘అతిక్రమ్యేతరాన్ సర్వా భవత్సేన సంశయః’ అని ఎవరి కారకత్వాలతోనూ సంబంధం లేకుండా మారకం ఇచ్చే గ్రహం శనైశ్చరుడు.
జైమిని సూత్రాలతో బాగా రీసెర్చ్ చేసేవారు ఒక మంచి మాట చెబుతారు. ఎవరి వ్యాపకములలో వారు వుంటే శని ఏమీ చేయడు అని. అది నిజమే. ఇతరుల పనులలో తలదూర్చినా చేయు వృత్తితో పాటు కొత్త వృత్తి ఆశ్రయించినా అది ఇబ్బంది పెట్టే అంశాలుగా మారుస్తాడు. ప్రాకృత ధర్మం తప్పిన వారి విషయంలోనే శని ప్రభావం అధికం అని చెబుతారు.
ఐరన్, స్టీల్, సిమెంట్, సాల్ట్బేస్డ్ వ్యాపారాలు, ఫర్నీచర్, మందులు వంటి వ్యాపారులు, వైద్యులు బాగున్నారు అంటే వారికి శని అనుగ్రహం వున్నది అని గ్రహించవచ్చు. అలాగే శని దోషం త్వరగా ప్రసరించేది మాలిన్యమైన సందర్భాలలోనే. అందులో భాగంగా పురాణాలలో విజ్ఞానం ఉండి అలాగే జ్యోతిశ్శాస్త్రం మీద అవగాహన ఉన్నవారు చెప్పే శని శాంతి మార్గాలు.
ప్రాకృతమయిన ధర్మాలు విడనాడటం, ఒకరి చెప్పులు మరొకరు ధరించడం, ఒకరోజు ధరించిన వస్తమ్రులు మరుసటిరోజు ధరించడం, పగలు నిద్రా సామాగ్రి వాడటం, మంచం మీద పగలు కూర్చోవడం, పడుకోవడం, ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండటం, రాత్రులందు తైలము రాసుకోవడం, ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడడం, పురుషుడు రోజూ తలస్నానం చేయకపోవడం, తోలు, ఉప్పు ఇనుము చెక్క వంటి వస్తువులు ఉచితంగా తీసుకోవడం, పాదప్రక్షాళన లేకుండా బయట తిరిగి ఇంటిలోకి రావడం, ఇలా జ్యేష్ఠాదేవిని ఆహ్వానించే అంశాలు అన్నీ కూడా ఎవరయితే పాటిస్తారో వారిని శనైశ్చరుడు ఇబ్బందికి గురి చేస్తాడు అని చెబుతారు.
No comments:
Post a Comment